వరిని వెంటనే కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2022-05-22T05:12:56+05:30 IST

కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని తేమ శాతం చూసుకొని వెంటనే కొనుగోలు చేయాలని కలె క్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు.

వరిని వెంటనే కొనుగోలు చేయాలి
కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌


తెలకపల్లి, మే 21: కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని తేమ శాతం చూసుకొని వెంటనే కొనుగోలు చేయాలని కలె క్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు. శనివారం తెలకపల్లి మండ లం చిన్నముద్దునూర్‌, లక్నారం పీఏసీఎస్‌ సెంటర్లను కలెక్టర్‌ పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొనుగోలు కేంద్ర సిబ్బం దితో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై ఆరా తీశారు. నెల్లికొండ మార్కెట్‌ యార్డులో ఆరుగురి రైతుల నుంచి 20 టన్నుల ధాన్యాన్ని, చిన్నముద్దునూర్‌ కేంద్రంలో నలుగురు రై తుల నుంచి 442క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి నట్లు సిబ్బంది వెల్లడించారు. సివిల్‌ సప్లయ్‌ ఆఫీసర్‌ మోహ న్‌బాబు, కోఆపరేటివ్‌ అధికారి పత్యానాయక్‌, మార్కెటింగ్‌ అధికారి బాలమణి తదితరులు కలెక్టర్‌ వెంట ఉన్నారు. 

Updated Date - 2022-05-22T05:12:56+05:30 IST