ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-01-18T05:53:19+05:30 IST

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్‌.టి.రామారావు అని టీడీపీ విశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
మాట్లాడుతున్న టీడీపీ విశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

టీడీపీ విశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, జనవరి 17: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్‌.టి.రామారావు అని టీడీపీ విశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు, పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, నాయకులు కె.శ్రీనివాసవర్మ, గోమాడ వాసు, జగదీశ్‌, మొల్లి పెంటిరాజు, హరికృష్ణ, విజయ్‌కుమార్‌, నమ్మి అప్పారావు, కొల్లి నాగేశ్వరరావు, పంచదార్ల ఉగ్రం, రాజేశ్‌, శ్రీరామ్‌, సాకే రతన్‌కాంత్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-18T05:53:19+05:30 IST