డైట్లో ఘనంగా ఆంగ్ల భాషా దినోత్సవం
ABN , First Publish Date - 2021-04-24T04:11:00+05:30 IST
స్థానిక ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్లో) శుక్రవారం అంతర్జాతీయ ఆంగ్ల భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ మాణిక్యంనాయుడు మాట్లాడుతూ ప్రముఖ నాటక రచయిత విలియం షేక్స్పియర్ స్మృత్యర్థం ఏప్రిల్ 23న ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా వ్యవహరిస్తారన్నారు.
భీమునిపట్నం, ఏప్రిల్ 23: స్థానిక ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్లో) శుక్రవారం అంతర్జాతీయ ఆంగ్ల భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ మాణిక్యంనాయుడు మాట్లాడుతూ ప్రముఖ నాటక రచయిత విలియం షేక్స్పియర్ స్మృత్యర్థం ఏప్రిల్ 23న ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా వ్యవహరిస్తారన్నారు. అనంతరం ఛాత్రోపాధ్యాయులు ప్రదర్శించిన ది మర్చంట్ ఆఫ్ వెన్నీస్ ఆంగ్ల నాటకం ఆకట్టుకుంది. షేక్స్పియర్ రచించిన పలు గేయాలనూ ఆలపించారు. అనంతరం విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇంగ్లీష్ లెక్చరర్లు జీజీఎస్ నాగేశ్వరరావు, బీవీ రామలక్ష్మి, కె.లావణ్య తదితరులు పాల్గొన్నారు.