ఘనంగా స్వాతి వేడుకలు

ABN , First Publish Date - 2021-12-03T05:46:54+05:30 IST

అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను బుధవారం వేదపండితులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా స్వాతి వేడుకలు

ఆళ్లగడ్డ, డిసెంబరు 2: అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను బుధవారం వేదపండితులు ఘనంగా నిర్వహించారు. వేకువజామున్నే ఉత్సవమూర్తులకు వేదపండితులు  పూజలు చేశారు. దిగువ అహోబిలంలో నవకలశాలతో సుదర్శన హోమం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



అహోబిలంలో పూజలు చేసిన ఎమ్మెల్యే: అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి పూజలు చేశారు. ఈయన రాకను పురస్కరించుకొని వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.


నంద్యాల(కల్చరల్‌): నంద్యాల తెలుగుపేటలో వెలసిన మద్దిలేటి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి సందర్భంగా గురువారం పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి జలాభిషేకం, పంచామృత అభిషేకం, స్నపన తిరుమంజనం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీరామమూర్తి, నిర్వాహకుడు మధు, భ క్తులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-03T05:46:54+05:30 IST