రిక్షా కార్మికులకు కార్పొరేషనే వేతనాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-01-17T05:23:01+05:30 IST

ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే రిక్షా కార్మికులు, ట్రాలీ డ్రైవర్లకు మున్సిపల్‌ కార్పొరేషనే వేతనాలు చెల్లించాలని ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ సంఘం డిమాండ్‌ చేసింది.

రిక్షా కార్మికులకు కార్పొరేషనే వేతనాలు చెల్లించాలి
కమిషనర్‌కు వినతి పత్రం అందజేస్తున్న అంబేద్కర్‌ సంఘం నాయకులు

కోల్‌సిటీ, జనవరి 16: ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే రిక్షా కార్మికులు, ట్రాలీ డ్రైవర్లకు మున్సిపల్‌ కార్పొరేషనే వేతనాలు చెల్లించాలని ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం సంఘం ప్రతినిధులు బొంకూరి మధు, మైస రాజేష్‌, కొంకటి లక్ష్మణ్‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మేయర్‌ అనీల్‌కుమార్‌, కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావుకు వినతిపత్రం అందజేశారు. లింగంపల్లి లింగయ్య, నందిపేట సాంబయ్య, కనకం శారద, అంబేద్కర్‌ సంఘం నాయకులు కాంపెల్లి సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:23:01+05:30 IST