రైట్స్ ఇష్యూ ఆగదు: సుజ్లాన్
ABN , First Publish Date - 2022-10-04T09:14:38+05:30 IST
ఈ నెల 11న ప్రారంభమయ్యే రైట్స్ ఇష్యూలో ఎలాంటి మార్పు లేదని సుజ్లాన్ ఎనర్జీ ప్రకటించింది.
న్యూఢిల్లీ : ఈ నెల 11న ప్రారంభమయ్యే రైట్స్ ఇష్యూలో ఎలాంటి మార్పు లేదని సుజ్లాన్ ఎనర్జీ ప్రకటించింది. కంపెనీ సీఎండీ తుల్సి తంతి ఆకస్మిక మరణం నేపథ్యంలో రైట్స్ ఇష్యూ వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలకు స్పందనగా కంపెనీ ఈ వివరణ ఇచ్చింది. ఈ నెల 4వ తేదీ నాటికి కంపెనీ రికార్డుల్లో వాటాదారులుగా ఉన్న అందరూ ఈ రైట్స్ షేర్ల కోసం దరఖాస్తు చేయవచ్చు. ప్రతి 21 షేర్లకు ఐదు షేర్ల చొప్పున రైట్స్ షేర్లు జారీ చేస్తారు. రూ.2 ముఖ విలువ ఉండే ఈ షేర్ల కోసం వాటాదారులు రూ.3 చొప్పున ప్రీమియం చెల్లించాలి.