చెరువుకట్ట గండికి రింగ్‌బండ్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-12-04T04:57:26+05:30 IST

మండలంలోని చిల్లకూరు గ్రామ చెరువుకట్టకు ఏర్పడిన గండికి అధికారులు గురువారం రింగ్‌బండ్‌ ఏర్పాటు చేశారు.

చెరువుకట్ట గండికి రింగ్‌బండ్‌ ఏర్పాటు
చిల్లకూరు చెరువు గండికి రింగ్‌బండ్‌ ఏర్పాటు చేస్తున్న రైతులు

పెళ్లకూరు,  డిసెంబరు 3 : మండలంలోని చిల్లకూరు గ్రామ చెరువుకట్టకు ఏర్పడిన గండికి అధికారులు గురువారం రింగ్‌బండ్‌ ఏర్పాటు చేశారు. నివర్‌ తుఫాన్‌తో ఆ చెరువుకు భారీ గండిపడింది. దాంతో నీరంతా బయటకు పోతుండడంతో స్థానిక రైతులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు నాయుడుపేట ఏఈ మహేష్‌ గండిని పరిశీలించారు. ఆ గ్రామానికి చెందిన వైసీపీ నేత మద్దూరు అంకయ్య సహకారంతో 1700 ఇసుక బస్తాలను గండికి ఇరువైపులా రింగ్‌బండ్‌ వేయించారు. దీంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు.





Updated Date - 2020-12-04T04:57:26+05:30 IST