ఆర్‌ఐవో బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-06-25T05:46:58+05:30 IST

ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారిగా(ఎఫ్‌ఏసీ) పుత్తూరులోని ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.గోపాల్‌రెడ్డి నియమితులయ్యారు.

ఆర్‌ఐవో బాధ్యతల స్వీకరణ
కొత్త ఆర్‌ఐవోను సన్మానిస్తున్న అధ్యాపకుల సంఘం నేతలు రవి తదితరులు

తిరుపతి(విద్య),జూన్‌24: ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారిగా(ఎఫ్‌ఏసీ) పుత్తూరులోని ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.గోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శు క్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆర్‌ఐవోగా ఉన్న వై.వెంకటరెడ్డి తనను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలని ఏపీ ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు విన్నవించుకున్నారు. ఆ మేరకు ఆయన్ను గురువారం రిలీవ్‌ చేశారు. ఇక నుంచి వెంకటరెడ్డి పీలేరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.రవి నేతృత్వంలో ఆర్‌ఐవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన గోపాలరెడ్డిని చవటగుంట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ నిర్మలాకుమారి, సంఘ ప్రతినిధులు వంశీకృష్ణ, రాజనాల, వసంత్‌కుమార్‌ సన్మానించి, అభినందించారు.


Updated Date - 2022-06-25T05:46:58+05:30 IST