Rishikonda dispute: విశాఖలో సీపీఐ నేతలను అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2022-08-01T17:11:02+05:30 IST
Vishakapatnam: విశాఖలో సీపీఐ (CPI) సీనియర్ నేత నారాయణ (Narayana) తో పాటు, పలువురు పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ తవ్వకాలను పరిశీలించేందుకు నారాయణ వచ్చారు.
Vishakapatnam: విశాఖలో సీపీఐ (CPI) సీనియర్ నేత నారాయణ (Narayana) తో పాటు, పలువురు పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ తవ్వకాలను పరిశీలించేందుకు నారాయణ వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుషికొండ (Rishikonda)లో అక్రమ తవ్వకాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని, 5 ఎకరాల్లో నిర్మాణాలు అని చెప్పి 30 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొ౦డ తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని అయితే ఆ మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారో తెలియదని టూరిజం డైరెక్టర్ చెబుతున్నారని నారాయణ పేర్కొన్నారు. రుషికొండను పరిశీలించేందుకు వెళ్తోన్న మమ్మల్ని అడ్డుకోవటం మానవహక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని, ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. విశాఖ అందాలను, ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు.