Mysuru బార్లో దారుణం.. బీరు సీసాలు, కత్తులతో ప్రత్యర్థి వర్గంపై దాడి
ABN , First Publish Date - 2022-05-03T22:39:23+05:30 IST
Mysuru బార్లో దారుణం.. బీరు సీసాలు, కత్తులతో ప్రత్యర్థి వర్గంపై దాడి
మైసూరు: బార్లో ఉన్న ప్రత్యర్థి వర్గంపై కొందరు వ్యక్తులు బీరు బాటిళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. Mysuruలోని బన్నూరు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో Social Mediaలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం.. బార్లో కూర్చుని ఉన్న వ్యక్తిపై వెనక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బీరు బాటిళ్లతో దాడిచేశారు. తొలుత ఓ వ్యక్తి బాధితుడి తలపై బీరు బాటిల్ పగలగొట్టగా, వెనకే వచ్చిన రెండో వ్యక్తి కూడా బీరు బాటిల్ పగలగొట్టాడు.
ఆ తర్వాత అతడిని కుర్చీలోంచి కిందికి తోసేసి దాడిచేశారు. మరో వ్యక్తి పొడవాటి కత్తితో అతడిపై దాడికి దిగాడు. కిందపడిన వ్యక్తి వారిని నెట్టి పైకి లేచి ఎదురుదాడికి దిగారు. దీంతో సీన్ Bar బయటకు మారింది. అయినప్పటికీ బాధితుడిని వదలకుండా కత్తితో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బన్నూరు పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
బాధితుడైన దయానంద్ మరో గ్యాంగ్కు చెందినవాడని, అతడిపైనా హిస్టరీ షీట్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దయానంద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ముఖ్యంగా ముగ్గురి పేర్లతోపాటు మరికొందరి పేర్లను కూడా పేర్కొన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు గల కారణం తెలియరాలేదని అన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.