ఆర్జేడీ లింగయ్యకు అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి

ABN , First Publish Date - 2021-03-07T05:05:18+05:30 IST

ఆర్జేడీ లింగయ్యకు అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి

ఆర్జేడీ లింగయ్యకు అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి

ఆర్జేడీగా సత్యనారాయణరెడ్డి


వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, మార్చి 6: పాఠశాల విద్యాశాఖ వరంగల్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ)గా పనిచేస్తున్న కందిమల్ల లింగయ్యకు అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లింగయ్యకు హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో కోఆర్డినేషన్‌ విభాగానికి అడిషనల్‌ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌లో ఎస్‌ఎ్‌సఏలో జేడీగా పనిచేస్తున్న కె.సత్యనారాయణరెడ్డిని వరంగల్‌ ఆర్జేడీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-03-07T05:05:18+05:30 IST