క్రమశిక్షణతో కార్యక్రమాలు చేపట్టాలి
ABN , First Publish Date - 2022-01-22T05:07:11+05:30 IST
క్రమశిక్షణతో కూడిన సేవా కార్యక్రమాలు చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆర్జేడీ ఏవీ సుబ్బారావు తెలిపారు.
స్కౌట్ ఉపాధ్యాయులకు ఆర్జేడీ సూచన
తాడికొండ, జనవరి 21: క్రమశిక్షణతో కూడిన సేవా కార్యక్రమాలు చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆర్జేడీ ఏవీ సుబ్బారావు తెలిపారు. తాడికొండలోని స్కౌట్స్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణకు శుక్రవారం హాజరైనా ఆయన ప్రసంగించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో బృందాలను ఏర్పాటు చేసి వారిలో వివిధ రూపాల్లో సేవా భావాన్ని కలిగించాలన్నారు. కార్యక్రమంలో రీజనల్ జాయింట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్కే బాష, స్కౌట్ రీజనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంఈవో ఇందిరా, క్యాంపు ఆఫీసర్ ఎం.మోహనరావు, బేసిక్ క్యాంప్ ఆఫీసర్ గర్రాల వెంకటేశ్వర్లు, సహాయకులు డీ.ప్రసాద్, డీ.నాగేశ్వరరావు, మద్దెన గోపి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.