పాఠశాలలను సందర్శించిన ఆర్జేడీ
ABN , First Publish Date - 2020-12-03T05:34:24+05:30 IST
మండలంలోని కూండ్రం, కొప్పాక, మామాడిపాలెం ఉన్నత పాఠశాలలను ఆర్జేడీ కె.నాగేశ్వరరావు బుధవారం సందర్శించారు.
కొత్తూరు: మండలంలోని కూండ్రం, కొప్పాక, మామాడిపాలెం ఉన్నత పాఠశాలలను ఆర్జేడీ కె.నాగేశ్వరరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఉపాధ్యాయులను ఆరా తీశారు. అలాగే విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేసుకున్నారు. విద్యార్థులు తప్పకుండా మాస్కు ధరించేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈవో దివాకర్ ఉన్నారు.