ప్రశ్నించే గొంతుని నొక్కొద్దు: ఆర్కే శిరీష
ABN , First Publish Date - 2022-07-19T17:55:01+05:30 IST
NIA అధికారులు ఇంటి మీద దాడి చేయడం సమంజసం కాదని మావోయిస్ట్ దివంగత అగ్ర నేత భార్య ఆర్కే శిరీష అన్నారు.
విజయవాడ: NIA అధికారులు తన ఇంటిపై దాడి చేయడం సమంజసం కాదని మావోయిస్ట్ దివంగత అగ్ర నేత భార్య ఆర్కే శిరీష( RK sirisha) అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని.. వైద్య పరీక్షల కోసం విజయవాడ వెళ్లానని అన్నారు. ఉదయం తాను ఇంట్లో లేని సమయంలో NIA అధికారులు తనిఖీలు చేశారని.. తన ఇంట్లో నలుగురు తలదాచుకున్నారని సమాచారం వచ్చిందని అధికారులు చెప్పడం విస్మయాన్ని కలిగించిదన్నారు. అంతేకాకుండా మావోయిస్ట్ల దగ్గర డంప్ స్వాధీనంలో కొంతమంది విరసం నేతల పేర్లు ఉన్నాయని చెప్పడంలో అధికారుల అంతర్యమోమిటో తెలియదన్నారు. మావోయిస్ట్లకు డబ్బులు పంపిస్తున్నారంటూ NIA అధికారులు చేస్తున్న ఆరోపణలు ఆవాస్తవమని చెప్పారు. ఎప్పటికైనా కుళ్లిపోయిన సమాజంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుందని హెచ్చరించారు. ప్రశ్నించిన గొంతుని నొక్కే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని ఆర్కే శిరీష ధ్వజమెత్తారు.