రొయ్యల వ్యాన్‌ ఢీ..దంపతులకు తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-04-22T05:19:01+05:30 IST

రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రగా యాల పాలయ్యారు.

రొయ్యల వ్యాన్‌ ఢీ..దంపతులకు తీవ్రగాయాలు

మొగల్తూరు,ఏప్రిల్‌ 21 : రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రగా యాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. కాళీ పట్నం గ్రామానికి చెందిన అం డ్రాజు సుబ్బారావు మరియమ్మ దంపతులు బుధవారం ఉదయం వారతిప్పలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కొత్తోట గ్రామం చేరుకునే సరికి రొయ్యలోడుతో భీమవరం వైపు వెళుతున్న వ్యాన్‌ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఆంజనేయులు రెండు కాళ్ళు నుజ్జునుజ్జు కాగా ఒక చెయ్యి తెగిపడిపోయింది.భార్య మరి యమ్మ తీవ్రగాయాలపాలైంది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికులు గాయాలపాలైన దంపతులను 108 వాహనంలో భీమవరం తరలించారు. సమాచారం అం దుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.




Updated Date - 2021-04-22T05:19:01+05:30 IST