ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2021-05-09T04:38:29+05:30 IST

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనగా ఒకరు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. ఈసంఘటన అశ్వారావుపేట మండలంలో శనివారం ఉదయం జరిగింది. మృతుడు ఆంధ్రాకు చెందిన వారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ
సంఘటన స్థలంలోనే మృతి చెందిన దుర్గారావు

ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

అశ్వారావుపేట రూరల్‌, మే 8: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనగా ఒకరు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. ఈసంఘటన అశ్వారావుపేట మండలంలో శనివారం ఉదయం జరిగింది. మృతుడు ఆంధ్రాకు చెందిన వారు. వివరాల్లోకి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడేనికి చెందిన పింగుల దుర్గారావు(46) తన స్నేహితుడైన కె.నరసింహరావుతో కలిసి తన ద్విచక్ర వాహనంపై తన అత్తారిల్లు అయిన దమ్మపేట మండలంలోని మందలపల్లికి వెళ్లాడు. అక్కడ బంధువులను చూసిన అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇదే సమయంలో అశ్వారావుపేట వైపు నుంచి ఖమ్మం వైపునకు వెళుతున్న లారీ అతి వేగంగా వచ్చి నారంవారిగూడెం సమీపంలో రాష్ట్రీయ రహదారిపై దుర్గారావు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదం అనంతరం లారీ చక్రాలు దుర్గారావు కాళ్లపై నుంచి వెళ్లాయి. దీంతో తీవ్రంగా గాయపడిన దుర్గారావును ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ఉన్న నరసింహారావుకు పలుచోట్ల గాయాలు కాగా అశ్వారావుపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. మృతుడు దుర్గారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-09T04:38:29+05:30 IST