ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
ABN , First Publish Date - 2021-06-23T05:51:40+05:30 IST
జాతీయ రహదారిపై లారీ–బస్సు ఢీకొని పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవర్లు, కండక్టర్ సహా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
ద్వారకా తిరుమల, జూన్ 22:జాతీయ రహదారిపై లారీ–బస్సు ఢీకొని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలుకు చెందిన వి.కృష్ణారెడ్డి కలప లోడుతో లారీని రాజమహేంద్రవరం పేపర్ మిల్కు తీసుకెళుతున్నాడు. కొవ్వూరు డిపో బస్సు రాజమహేంద్రవరం నుంచి ఏలూరు వైపు 25 మంది ప్రయాణికులతో వస్తుండగా ద్వారకా తిరుమల మండలం బుట్టాయగూడెం కాలనీ వద్ద లారీ ముందు చక్రం టైర్ పేలి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది. దీంతో లారీ డ్రైవర్తోపాటు కొవ్వూరుకు చెందిన బస్సు డ్రెవర్ కె.సూర్యారావు, యర్నగూడెంకు చెందిన కండక్టర్ దుర్గారావు, రాజమహేంద్ర వరానికి చెందిన ప్రయాణికులు దివ్యశ్రీ, కోటేశ్వరి, దూబచర్లకు చెందిన సాగిని, దేవరపల్లికి చెందిన యర్రంశెట్టి శ్రీను తీవ్రంగా గాయపడగా దూబచర్లకు చెందిన దయామణి, ఉదయరత్నం, జ్యోత్స్న, వెన్నెల, కిరణ్మయికి స్వల్ప గాయాలయ్యా యి. 108 సిబ్బంది, ద్వారకాతిరుమల పోలీసు సిబ్బంది క్షత గాత్రులను 108లో భీమడోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీలో కలప లోడును ఎక్స్కవేటర్తో దించి స్థానికుల సాయంతో లారీ డ్రైవర్ను బయటకు తీశారు. ఎస్ఐ సురేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.