కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2020-11-24T16:40:04+05:30 IST
నిడుమోలు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.
కృష్ణాజిల్లా: మొవ్వ మండలం, నిడుమోలు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళుతున్న ముగ్గురిని వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు గూడూరు మండలం కలపటంకు చెందిన మద్దాల శ్రీను, పెనుగూడికి చెందిన ఎండి.ఇంతియాజ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.