ట్యాంకర్‎ను ఢీకొన్న కారు..ఇద్దరు చిన్నారులు మృతి

ABN , First Publish Date - 2020-11-28T17:27:41+05:30 IST

నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు...

ట్యాంకర్‎ను ఢీకొన్న కారు..ఇద్దరు చిన్నారులు మృతి

రంగారెడ్డి: నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో గాయాలబారినపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో చోటు చేసుకుంది. నందిగామ బైపాస్ వద్ద ఆగివున్న కంటైనర్‎ను కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-28T17:27:41+05:30 IST