రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం...ఆరుగురు మృతి

ABN , First Publish Date - 2020-12-02T13:48:43+05:30 IST

జిల్లాలో ఘోర రోడ్డు జరిగింది. బోర్‎వెల్ లారీ-ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు...

రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం...ఆరుగురు మృతి

రంగారెడ్డి: జిల్లాలో ఘోర రోడ్డు జరిగింది. బోర్‎వెల్ లారీ-ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చేవెళ్ల మండలం కందవాడ శివారు మలుపు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాదులోని తాడ్‌బండ్‌ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 11 మంది(ఇద్దరు చిన్నారులు సహా) కర్నాటక రాష్ట్రంలోని గుర్మిత్‌కల్‌కు తెల్లవారుజామున బయల్దేరారు. చేవెళ్ల మండలంలోని కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వీరు ప్రయాణిస్తున్న కారు.. ముందుగా వెళ్తున్న వాహనాలను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.


మృతులు: ఆసిఫ్‌ఖాన్‌(50), సానియా(18), నజియా బేగం(45), హర్ష(28), నజియా భాను(36), హర్షభాను(6), ఖలీద్‌ (43)గా గుర్తించారు. కరీనా బేగం, అయూమ్‌ ఖాన్‌, నిజార్‌బేగ్‌, అన్వర్‌ ఖాన్‌ లకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడినవారిని హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, స్వల్పంగా గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాద తీవ్రతతో కారు నుజ్జు నుజ్జయింది.





Updated Date - 2020-12-02T13:48:43+05:30 IST