రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:47:54+05:30 IST

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతి

వీరులపాడు, జనవరి 15: గుర్తు తెలియని వాహనం ఢీకొని జుజ్జూరుకు చెందిన టీడీపీ మైనార్టీ సెల్‌ నాయకుడు ఖాదర్‌బాబ(25) మృతి చెందాడు. వెల్లంకి నుంచి బైకుపై గురువారం రాత్రి జుజ్జూరు వస్తుండగా మార్గమధ్యంలోని హెచ్‌పీసీఎల్‌ పైప్‌లైన్‌ వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఖాదర్‌బాబను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు రోజుల క్రితం పరిటాలలో భోగి వేడుకలకు జుజ్జూరు నుంచి వంద బైకులతో ర్యాలీగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీసులు ఖాదర్‌బాబ తీసుకున్నాడు. ఖాదర్‌బాబ మృతి బాధాకరమని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొండగుంట శ్రీనివాసకుమార్‌ అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 


Updated Date - 2021-01-16T05:47:54+05:30 IST