పెళ్లైన నెలన్నరకే తిరిగిరాని లోకాలకు...
ABN , First Publish Date - 2021-01-22T05:22:39+05:30 IST
ఆ యువకుడికి పెళ్లై నెలన్నర రోజులే అవుతుంది. ఇంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు అందించిన వివరాలు ప్రకారం... ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా సిమ్లిగూడమండలం తలమణ్య గ్రామానికి చెందిన సురేష్ శ్రీహరియా(24) పాటూరు గ్రామ సమీపంలో ఎస్.కోట-విశాఖ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్ర మాదంలో దుర్మరణం చెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
వేపాడ : ఆ యువకుడికి పెళ్లై నెలన్నర రోజులే అవుతుంది. ఇంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు అందించిన వివరాలు ప్రకారం... ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా సిమ్లిగూడమండలం తలమణ్య గ్రామానికి చెందిన సురేష్ శ్రీహరియా(24) పాటూరు గ్రామ సమీపంలో ఎస్.కోట-విశాఖ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్ర మాదంలో దుర్మరణం చెందాడు. తన స్నేహితుడు బొన్ను బంకుతో కలిసి విశాఖ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి స్టాపర్ను ఢీకొట్టి పడిపో యాడు. తీవ్రంగా గాయపడిన సురేష్ను 108లో ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తర లించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. బొన్ను బంకు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సురేష్ తండ్రి పురుషో శ్రీహరియా ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వల్లంపూడి ఎస్ఐ జి.లోవరాజు తెలిపారు. ఇదిలాఉండగా సురేష్కు నెలన్నర క్రితమే వివాహం జరిగింది. ఇంతలో ఈ ప్ర మాదం జగరడంతో అతని భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపి స్తుంది. సురేష్కు తండ్రితోపాటు తల్లి దర్జోమణి, ఇద్దరు అక్కచెలెళ్లు ఉన్నారు.