టాటా ఏస్ బోల్తా.. వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-01-24T05:53:00+05:30 IST
టాటా ఏస్ బోల్తా.. వ్యక్తి మృతి
నవాబుపేట: డ్రైవర్ వేగంగా టాటా ఏస్ వాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మృతి కి కారణయ్యాడు. ఎస్ఐ వెంకటేషం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పులిమామిడికి చెందిన డ్రైవర్ అమీర్ఖాన్, షేక్ అస్ఘర్(50)తో కలిసి టాటాఏస్ (ఏపీ23 ఎక్స్7184) వాహనంలో పాత టైర్ల కోసం కోట్పల్లి, మర్పల్లి, మోమిన్పేటలకు వెళ్లి టైర్ల లోడ్తో వస్తుండగా తిమ్మారెడ్డి గేటు సమీపంలో మలుపు వద్ద వాహనం బోల్తా పడింది. డ్రైవర్ పక్కన కూర్చున్న అస్ఘర్ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.