రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-03-07T02:31:50+05:30 IST
మండలంలోని అక్కగారిపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూమా సు
పెళ్లకూరు, మార్చి 6 : మండలంలోని అక్కగారిపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూమా సుబ్బయ్య (27) దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు, చిత్తూరుజిల్లా కేవీబీ పురం మండలం కర్లపూడికి చెందిన సుబ్బయ్య శనివారం పనిమీద నాయుడు పేటకు వచ్చి తిరిగి సొంత గ్రామానికి శ్రీకాళహస్తి వైపు ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు. ఆ సమయంలో సుబ్బయ్య అక్కగారిపేట వద్ద ఎదురుగా వస్తున్న ఓ మినీట్రక్కును ఢీ కొట్టాడు. దీంతో సుబ్బయ్య తలకు తీవ్ర రక్తగాయమైంది. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ మనోజ్కుమార్ తన సిబ్బందితో వెళ్లి క్షతగాత్రుడిని 108 ద్వారా శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుబ్బయ్య మృతి చెందాడు. మృతుడికి 6 నెలల కిందట వివాహమైనట్లు తెలిసింది. ఎస్ఐ మనోజ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.