రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-03-07T05:43:57+05:30 IST
ఆటో, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన దుర్ఘటన శనివారం చీకటీగలపాలెం అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుంది.
మృతులు ప్రకాశం జిల్లా వాసులు
వినుకొండటౌన్, మార్చి 6: ఆటో, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన దుర్ఘటన శనివారం చీకటీగలపాలెం అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మంగినపూడికి చెందిన పోలం వెంకటకృష్ణప్రసాద్ (19), మార్కాపురానికి మందటి సురేష్రాజ్ (20) మార్కాపురంలోని ఓ లాడ్జిలో పని చేస్తుంటారు. వీరిద్దరూ టీవీ రిపేరు కోసం బైక్పై వినుకొండ వస్తుండగా చీకటీగలపాలెం అడ్డరోడ్డు వద్ద వినుకొండ నుంచి ఇనుప ఊసల లోడుతో వెళ్తున్న ఆటో ఢీంది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.