Road Accident.. కాకినాడ జిల్లా: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-03T15:24:48+05:30 IST

తుని రూరల్ వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident.. కాకినాడ జిల్లా: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

కాకినాడ (kakinada) జిల్లా: తుని రూరల్ వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మ్యాజిక్ ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు విజయనగరం జిల్లా, దీనికల పట్టి నుంచి రామచంద్రపురంలో ఓ శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-03T15:24:48+05:30 IST