గౌలిగూడ వద్ద రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-12-06T06:17:45+05:30 IST
మండలంలోని గౌలిగూడ వద్ద టాటాఏస్, మరో వాహనం(క్వాలీస్) ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లాకేం ద్రానికి చెందిన పలువురు భక్తుల
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన
ఎనిమిది మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
క్షతగాత్రులు అందరూ ఆదిలాబాద్కు చెందిన వారే..
నేరడిగొండ, డిసెంబరు 5: మండలంలోని గౌలిగూడ వద్ద టాటాఏస్, మరో వాహనం(క్వాలీస్) ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లాకేం ద్రానికి చెందిన పలువురు భక్తుల బృందం ఆదివారం కావడంతో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మ దర్శనం నిమిత్తం ఆలయానికి వెళ్లారు. మొక్కులు చెల్లించుకున్న భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు. టాటాఏస్ వాహనంలో అడెల్లి నుంచి ఆదిలాబాద్ వైపు వస్తుండగా గౌలిగూడ వద్ద మరో వాహనం(క్వాలీస్) ఢీకొన్నాయి. ప్రమాదం రాత్రి వేళ కావడంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు అయోమయానికి గురయ్యారు. వెంటనే క్షతగాత్రులను నిరల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, టాటా ఏస్లో ఉన్నవారందరూ ఆదిలాబాద్కు చెందిన వారు. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విమంగా ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.