మినీలారీ, కారు ఢీ
ABN , First Publish Date - 2022-06-28T03:20:05+05:30 IST
మినీలారీ - కారు ఢీకొన్న సంఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.
ఒకరికి తీవ్రగాయాలు
వరికుంటపాడు, జూన్ 27: మినీలారీ - కారు ఢీకొన్న సంఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల మేరకు.. మండల పరిధిలోని కోల్డ్ స్టోరేజి సమీపంలో సోమవారం 565వ జాతీయ రహదారిపై విజయవాడ నుంచి కడప వెళ్తున్న మినీలారీని ఎదురుగా బెంగళూరు నుంచి కందుకూరు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో కారును డ్రైవింగ్ చేస్తున్న ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నిడమానూరు గ్రామానికి చెందిన ఎం. మనోజ్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 సిబ్బంది అతన్ని చికిత్స నిమిత్తం ప్రకాశం జిల్లా పామూరు వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఈ ప్రమాదంలో మినీలారీ బోల్తా పడగా కారు ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది. ఎస్ఐ బాలమహేంద్రనాయక్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.