Chennai: కారును ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2021-10-30T14:34:17+05:30 IST

సేలం జిల్లా భవానీ వద్ద శుక్రవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఓ డాక్టర్‌ సహా ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... మేట్టూరు సమీపం ఉడయ నూరులో దేవనాధన్‌ (53), ఇంద్రాణి(51) అనే భార్యా భర్తలు నివసిస్తున్నా

Chennai: కారును ఢీకొన్న లారీ

                - డాక్టర్‌ సహా ముగ్గురు దుర్మరణం


చెన్నై: సేలం జిల్లా భవానీ వద్ద శుక్రవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఓ డాక్టర్‌ సహా ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... మేట్టూరు సమీపం ఉడయ నూరులో దేవనాధన్‌ (53), ఇంద్రాణి(51) అనే భార్యా భర్తలు నివసిస్తున్నారు. దేవనాధన్‌ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇంద్రాణి వనవాసి ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ దేవనాధన్‌ కంపెనీలో పనిచేస్తున్న సత్యశీలన్‌ (24) అనే ఉద్యోగిని వెంటబెట్టుకుని కారులో కోయంబత్తూరులోని ఆస్పత్రికి బయల్దేరారు. ఆస్పత్రిని సందర్శించిన తర్వాత ముగ్గురూ కారులో స్వస్థలానికి పయన మయ్యారు. కారును దేవనాధన్‌ నడిపారు. శుక్రవారం వేకువజామున భవానీ సమీపంలో మెట్టూరు రహదారిలో కాడప్పనల్లూరు కూడలి వద్ద ఆ కారును మెట్టూరు నుంచి భవానీ వైపు వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ సంఘటనలో కారు ముందుభాగం పూర్తిగా లారీ దిగువభాగంలో దూసుకుపోయి నుజ్జు నుజ్జయ్యింది. కారు శిథిలాల మధ్య తీవ్ర గాయాలతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన వెళ్ళి లారీ దిగువ నలిగిన కారును గంటసేపు పోరాడి వెలికితీశారు. కారు శిథిలాల మధ్య చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భవానీ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2021-10-30T14:34:17+05:30 IST