కళాశాల బస్సు-కారు ఢీ

ABN , First Publish Date - 2022-05-26T06:45:58+05:30 IST

గొల్లప్రోలు మండలం దుర్గాడ సెంటర్‌ వద్ద బుధవారం సాయ ంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

కళాశాల బస్సు-కారు ఢీ

ఒకరి మృతి..ఇద్దరికి తీవ్రగాయాలు
గొల్లప్రోలు రూరల్‌, మే 25: గొల్లప్రోలు మండలం దుర్గాడ సెంటర్‌ వద్ద బుధవారం సాయ ంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దాపురం మండలం వడ్లమూరు నుంచి అన్నవరం వెళ్తున్న కారు 216వ జాతీయ రహదారిపై దుర్గాడ సెంటర్‌ వద్ద మలుపు తిరుగుతున్న ఆదర్ష్‌ ఇంజనీరింగ్‌ కళాశాల బస్సు ఢీకొన్నాయి. కారులో ఉన్న వడ్లమూరుకు చెందిన బిక్కిన సత్తిరాజు(57) మరణించగా, బిక్కిన శ్రీనివాస్‌, రాగంపేటకు చెందిన కారు డ్రైవర్‌ బండారు కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-05-26T06:45:58+05:30 IST