జాతీయ రహదారిపై కారు బీభత్సం

ABN , First Publish Date - 2022-06-28T06:27:15+05:30 IST

చొల్లంగి జాతీయ రహదారిపై సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

జాతీయ రహదారిపై కారు బీభత్సం

ఒకరి మృతి..ఇద్దరికి గాయాలు
తాళ్ళరేవు, జూన్‌ 27: చొల్లంగి జాతీయ రహదారిపై సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోరంగి పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నం మధురవాడకు చెందిన యువ ఇంజనీర్లు నలుగురు కొత్తగా ఉద్యోగాలు వచ్చాయన్న అనందంతో అదివారం కారులో యానాం వచ్చి ఆనందంగా గడిపి సోమవారం ఉదయం 11గంటలకు యానాం నుంచి విశాఖపట్నానికి కారులో బయలుదేరారు. అతివేగంగా వెళ్తూ చొల్లంగి వద్ద కాకినాడ నుంచి తాళ్ళరేవు వస్తున్న ఆటోను ఢీకొన్నారు. దీంతో ఆటో బోల్తాపడింది. అలాగే కారు రెండు ద్విచక్రవాహనాలను ఢీకొనడంతో ఒక ద్విచక్ర వాహనంపై ఉన్న కాకినాడ జగన్నాథపురం గోలీలపేటకు చెందిన పినపోతు సతీష్‌కుమార్‌ (50) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలు కాగా కాకినాడ ప్రభు త్వాసుపత్రికి కోరంగి పోలీసులు అంబులెన్స్‌లో తరలించారు.  ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా కోరంగి పోలీసులు ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేశారు. ఎస్‌ఐ శివకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-28T06:27:15+05:30 IST