కారు ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2022-07-01T06:37:50+05:30 IST
చిన్నింపేట స్టోన్క్రషర్కు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంట వీరశంకర్(32) అనే వ్యక్తి మృతి చెందాడు.
ఏలేశ్వరం, జూన్ 30: చిన్నింపేట స్టోన్క్రషర్కు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంట వీరశంకర్(32) అనే వ్యక్తి మృతి చెందాడు. జగ్గంపేట పట్టణంలో నివాసం ఉంటున్న వీరశంకర్ భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రత్తిపాడులో భవన నిర్మాణ పనులకు వెళ్లిన ఆతడు తిరిగి స్వగ్రామానికి తన మోటారుబైక్పై వస్తుండగా చిన్నింపేట వద్ద వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈఘటనలో వీరశంకర్ బైక్పై నుంచి కిందకు పడిపోవడంతో తలపై బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య చిన్నారి విజయ, ఏడేళ్ల వయస్సు కలిగిన కుమార్తె సృజన, తల్లి కృపావతి, తండ్రి బాబ్జి ఉన్నారు. కుటుంబమంతా అతనిపై ఆధారపడి జీవిస్తున్నారు. భార్య విజయరాణి ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.