Road accident: తల్లి అంత్యక్రియలకు వెళ్తూ ...

ABN , First Publish Date - 2022-09-18T15:27:37+05:30 IST

సేలం జిల్లా వాళప్పాడి సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతిచెందగా, మరో నలుగురికి

Road accident: తల్లి అంత్యక్రియలకు వెళ్తూ ...

                            - రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 17: సేలం జిల్లా వాళప్పాడి సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు(Karnataka State Bangalore)కు చెందిన పార్తీపన్‌ (62) నైవేలిలో ఉంటున్న తల్లి మృతిచెందిందనే సమాచారంతో బెంగుళూరు నుంచి శనివారం భార్య పద్మావతి, కుమార్తె మహాలక్ష్మి (37), అల్లుడు కుంకుమరాజ్‌, మనవరాళ్లు అనల్య (9), సమీక్ష (11)లతో కలసి కారులో బయల్దేరాడు. కుంకుమరాజ్‌ నడుపుతున్న కారు వాళప్పాడి సమీపం మేట్టుపట్టి సెల్లియమ్మన్‌ నగర్‌ సబ్‌ స్టేషన్‌ సమీపంలో హఠాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన డివైఢర్‌ను డీకొంది. చుట్టుపక్కల వారు కారు శిధిలాల్లో ఉన్న వారిని వెలికితీసి ఆసుపత్రికి తరలిస్తుండగా పార్తీపన్‌, మహాలక్ష్మి మృతిచెందారు. ఈ ఘటనపై వాళప్పాడి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-09-18T15:27:37+05:30 IST