ఈరోడ్ సమీపంలో లారీని ఢీకొన్న కారు
ABN , First Publish Date - 2021-11-19T13:40:59+05:30 IST
ఈరోడ్ జిల్లా శివగిరి వద్ద కారు - లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు సహా ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని ముత్తుగౌండమ్పాళయంకు చెందిన
- ఐదుగురి దుర్మరణం
- మరో ముగ్గురి పరిస్థితి విషమం
పెరంబూర్(చెన్నై): ఈరోడ్ జిల్లా శివగిరి వద్ద కారు - లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు సహా ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని ముత్తుగౌండమ్పాళయంకు చెందిన ఎనిమిదిమంది గురువారం ఉదయం ఆమ్నీ కారును అద్దెకు తీసుకొని పళని మురుగన్ ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకొని తిరుగుప్రయాణమయ్యారు. శివగిరి విళగెత్తి సమీపంలో ఎదురుగా వస్తున్న సిమెంటు లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ పడయప్ప, కారులో ప్రయాణిస్తున్న దైవానై, మంజుల, అరుక్కాని, తెన్మొళిలు సంఘటనాస్థలంలోనే మృతిచెందగా, కుమరేశన్, మోహన్కుమార్, ముత్తుస్వామిలకు తీవ్రగా యాలయ్యాయి. సమాచారం అందుకున్న ఈరోడ్ టౌన్ డీఎస్పీ మోహనసుందరం నేతృత్వంలో పోలీసులు అక్కడకు చేరుకొని కారు శిథిలాల నుంచి క్షతగాత్రు లను వెలికితీసి ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.