Guntur: తెనాలిలో ఆటోను ఢీకొన్న లారీ..వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-10-01T13:17:21+05:30 IST

తెనాలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాగర్లమూడి వద్ద కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..

Guntur: తెనాలిలో ఆటోను ఢీకొన్న లారీ..వ్యక్తి మృతి

గుంటూరు: తెనాలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాగర్లమూడి వద్ద కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కూలీలు సంగం జాగర్లమూడి నుంచి తెనాలి పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సుబ్బారావుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-10-01T13:17:21+05:30 IST