AP News: లోయలో పడ్డ బోలెరో పికప్... 15 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-06-27T20:31:52+05:30 IST

జిల్లాలోని పాడేరు ఘాట్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. 12వ మైలురాయి సమీపంలో బోలెరో పికప్ అదుపుతప్పి లోయలో బోల్తాపడింది.

AP News: లోయలో పడ్డ బోలెరో పికప్... 15 మందికి గాయాలు

అల్లూరి: జిల్లాలోని పాడేరు ఘాట్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. 12వ మైలురాయి సమీపంలో బోలెరో పికప్ అదుపుతప్పి లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది గిరిజనులకు గాయాలయ్యాయి. వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి రెండు అంబులెన్స్‌ల ద్వారా తరలించారు. విశాఖపట్నం ఆర్.కె బీచ్ వద్ద జరుగనున్న బి.ఎస్.పి ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

Updated Date - 2022-06-27T20:31:52+05:30 IST