Guntur: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
ABN , First Publish Date - 2022-05-27T15:38:17+05:30 IST
జిల్లాలోని ఆటో నగర్ సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
గుంటూరు: జిల్లాలోని ఆటో నగర్ సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బైక్ను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. భార్య, భర్త, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా...కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. మృతులు విజయవాడ వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.