కర్ణాటకలో రోడ్డు ప్రమాద ఘటన బాధాకరం: మంత్రి Talasani

ABN , First Publish Date - 2022-06-03T18:31:09+05:30 IST

: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

కర్ణాటకలో రోడ్డు ప్రమాద ఘటన బాధాకరం: మంత్రి Talasani

హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani srinivas yadav) అన్నారు. కర్ణాటకలో హైదరాబాద్‌కు చెందిన వారు ప్రయాణిస్తున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపడతామని... మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-06-03T18:31:09+05:30 IST