ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి, 30మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-03-06T22:26:31+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా 25మంది

ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి, 30మందికి గాయాలు

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా 25మంది గాయపడ్డారు. నోయిడా జిల్లాలోని లోధ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని అలీఘర్ జిల్లా కలెక్టర్ చంద్రభూషన్ సింగ్ పేర్కొన్నారు. 


ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సుమారు 30 మంది గాయలపాలయ్యారు. వారిలో తీవ్రంగా గాయపడిన కొందరిని జవహర్ లాల్ నెహ్రు మెడికల్ కాలేజీకి తరలించినట్లు కలెక్టర్ సింగ్ తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఆయన అన్నారు. 


ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్యం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.  

Updated Date - 2021-03-06T22:26:31+05:30 IST