Palnaduలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-05-23T17:26:54+05:30 IST
జిల్లాలోని సత్తెనపల్లి మండలం కంటేపూడి నలంద కాలేజీ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం కంటేపూడి నలంద కాలేజీ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ను బొలేరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మున్నా(23), అజయ్(24)గా గుర్తించారు. ఎలక్ట్రిక్ వస్తువులు కొసం పేరేచర్ల వెళ్లుతుండగా ప్రమాదం జరిగింది. మృతులు పేరేచర్ల, క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.