
మార్కాపురం: ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అతివేగంగా వెళ్తూ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మార్కాపురం మండలం తిప్పాయపాలెం దగ్గర ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకరు చిత్తూరు జిల్లా బాకరావుపేటకి చెందిన తేజగా గుర్తించారు. ఘటనా స్థలంలో లారీని వదిలి డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు.
ఇవి కూడా చదవండి