సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2022-01-01T21:13:09+05:30 IST
జిల్లాలోని జహీరాబాద్ మండలం డిడ్గీ దగ్గర
సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్ మండలం డిడ్గీ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొని నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ బైక్ను ఢీకొన్నది. బైక్పై వెళ్తున్న దంపతులు, 8 నెలల చిన్నారి మృతి చెందారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృత్యువాత పడ్డారు. బైక్పై వెళ్తున్న దంపతులను అనంతపురం జిల్లా గుత్తి వాసులుగా నిర్థారించారు. మృతులను బాలరాజు(28), శ్రావణి(22), అమ్ములు(8నెలలు), వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ వాసి ఫరీద్(25)గా గుర్తించారు.