సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం...దంపతులు మృతి

ABN , First Publish Date - 2022-04-28T14:11:16+05:30 IST

జిల్లాలోని రాజీవ్ రహదారి రాణే కంపెనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం...దంపతులు మృతి

సిద్దిపేట: జిల్లాలోని రాజీవ్ రహదారి రాణే కంపెనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గౌరారం వైపు నుండి ప్రజ్ఞాపుర్ వెళ్తున్న కారు అదుపుతప్పి అవతలి రోడ్డుపై వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా... ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు గజ్వేల్ పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు. అలాగే గాయాల పాలైన వారు గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-28T14:11:16+05:30 IST