రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
ABN , First Publish Date - 2022-05-16T06:51:23+05:30 IST
మడికి(పొట్టిలంక సమీపంలో) వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది.
ఆలమూరు, మే 15: మడికి(పొట్టిలంక సమీపంలో) వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఎస్ఐ ఎస్.శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన పి.అభినయ(20) పొట్టిలంకలోని బంధువుల ఇంటికి వచ్చింది. పొట్టిలంకలోని బంధువుల ఇంట్లో నిద్రిస్తున్న ఆమె ఆదివారం తెల్లవారుజామును బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.