రోడ్డు ప్రమాదంలో లెక్చరర్‌ మృతి

ABN , First Publish Date - 2022-05-27T15:44:33+05:30 IST

నగర శివారు ప్రాంతమైన పుళల్‌ జీఎన్టీ రోడ్డులో లారీ ఢీకొని భర్త కళ్ల ముందే లెక్చరర్‌ మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. పుళల్‌ కావంగరై కన్నప్పసామి నగర్‌ 20వ

రోడ్డు ప్రమాదంలో లెక్చరర్‌ మృతి

పెరంబూర్‌(చెన్నై): నగర శివారు ప్రాంతమైన పుళల్‌ జీఎన్టీ రోడ్డులో లారీ ఢీకొని భర్త కళ్ల ముందే లెక్చరర్‌ మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. పుళల్‌ కావంగరై కన్నప్పసామి నగర్‌ 20వ వీధికి చెందిన అరుణ్‌కుమార్‌ భార్య పూజ (24) మాదానంకుప్పంలోని ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. బుధవారం సాయంత్రం కళాశాల ముగిసిన తర్వాత పూజను వెంటతీసుకుని అరుణ్‌కుమార్‌ మోటార్‌సైకిల్‌పై ఇంటికి బయల్దేరాడు. పుళల్‌ పోలీస్ స్టేషన్‌ ఎదురుగా జీఎన్‌టీ రోడ్డులో వారి బైక్‌ను మాధవరం నుంచి రెడ్‌హిల్స్‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో పూజ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, అరుణ్‌కుమార్‌కు స్పల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన మాధవరం ట్రాఫిక్‌ పోలీసులు మనలికి చెందిన లారీ డ్రైవర్‌ శక్తివేల్‌ (24)ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-05-27T15:44:33+05:30 IST