రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-01-24T05:26:37+05:30 IST

మండలంలోని పుంజులూరుపాడు రైల్వే గేటు సమీపంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీడ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
లారీ క్యాబిన్‌లో ఇరుక్కొని మృతి చెందిన డ్రైవర్‌ ప్రశాంత్‌జిత్‌ మాండల్‌

వెంకటాచలం, జనవరి 23 : మండలంలోని పుంజులూరుపాడు రైల్వే గేటు సమీపంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీడ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టానికి చెందిన ప్రశాంత్‌జిత్‌ మాండల్‌ (32) గత కొద్ది రోజులుగా గొలగమూడి క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న పరిశ్రమల కేంద్రంలోని ఓ ప్రైవేటు సిమెంట్‌ కంకర మిక్సింగ్‌లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఆదివారం సిమెంట్‌ కంకర మిక్సింగ్‌ లోడుతో కృష్ణపట్నం పోర్టుకు లారీలో బయలుదేరాడు. పుంజులూరుపాడు రైల్వే గేటు దాటగానే ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న కంకర మిక్సింగ్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీడ్రైవర్‌ ప్రశాంత్‌జిత్‌ మాండల్‌ క్యాబిన్‌లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి ఎస్‌ఐ ఆయ్యప్ప చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-24T05:26:37+05:30 IST