పూర్తిగా తెగి రోడ్డు పక్కన ముళ్ల కంపల్లో పడ్డ కాలు

ABN , First Publish Date - 2021-10-24T21:15:25+05:30 IST

జిల్లా కలిగిరిలో కోయ్యల మిల్లు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ని బైకు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

పూర్తిగా తెగి రోడ్డు పక్కన ముళ్ల కంపల్లో పడ్డ కాలు

నెల్లూరు: జిల్లా కలిగిరిలో కోయ్యల మిల్లు వద్ద  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ని బైకు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి కాలు పూర్తిగా తెగి రోడ్డు పక్కన ముళ్ల కంపల్లో పడి వుంది. గాయపడ్డ యువకులు పోలంపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కావలి ఏరియా వైద్యశాలకు  తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-10-24T21:15:25+05:30 IST