Hyderabad: ఎదురేదురుగా రెండు బైక్‎లు ఢీ..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-05-03T12:10:11+05:30 IST

వనస్థలిపురం ఇంజాపూర్‌ అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురేదురుగా రెండు బైక్‎లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే

Hyderabad: ఎదురేదురుగా రెండు బైక్‎లు ఢీ..ఇద్దరు మృతి

హైదరాబాద్‌: వనస్థలిపురం ఇంజాపూర్‌ అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురేదురుగా రెండు బైక్‎లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read more