రోడ్డు దాటుతుండగా ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టిన డీసీఎం..

ABN , First Publish Date - 2022-05-08T14:17:01+05:30 IST

బెల్లంపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నాల దగ్గర రోడ్డు దాటుతుండగా ఇద్దరు వ్యక్తులను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో

రోడ్డు దాటుతుండగా ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టిన డీసీఎం..

మంచిర్యాల: బెల్లంపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నాల దగ్గర రోడ్డు దాటుతుండగా ఇద్దరు వ్యక్తులను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read more