రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-10-17T06:09:35+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఖానాపురం, అక్టోబరు 16: మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ఓ పొక్లెయిన్‌ డ్రైవర్‌ మృతి చెందారు. ఎస్సై నండ్రు సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పొక్లెయిన్‌ డ్రైవర్‌ పులిచేరు చిన్నబాబు(32) ఈనెల 13న మంగళవారిపేటలోని తన సోదరి రాయపురం ఉపేంద్ర ఇంటికి వచ్చాడు. శుక్రవారం తిరుగు ప్రయాణంలో నల్లబె ల్లికి చిన్నబాబు తన ద్విచక్రవాహనం బయలు దేరాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని మసీదు సమీపంలో వెనక నుంచి వస్తున్న రాగంపేట గ్రామానికి చెందిన కొయ్యడి కృష్ణ బైక్‌ నడుపుతూ చిన్నబాబు ద్విచక్ర వాహనాన్ని ఢీకొ ట్టాడు. దీంతో చిన్నబాబు కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సాయంతో అతడిని నర్సం పేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చిన్నబాబుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 


Updated Date - 2021-10-17T06:09:35+05:30 IST